ఇటీవల చాలా మంది క్రికెటర్లు గాయాలపాలై అనేక ఇబ్బందులు పడుతుంటారు.ఒకసారి గాయం అయితే కోలుకోవడానికి కొన్నిరోజులు, ఫిట్ నెస్ సాధించడానికి కొన్ని రోజులు, ఫామ్ లోకి రావడానికి కొన్నిరోజులు పడుతుంది.
దీని వల్ల వారు కొన్ని మ్యాచ్ లను ఆడలేకపోతుంటారు.దీనివల్ల అభిమానులల్లో కూడా నిరాశ అనేది చోటుచేసుకుంటుంది.
ఇప్పుడు జరిగిన ఐపిఎల్ లో కూడా కొందరు ఆటగాళ్లు గాయాలపాలయ్యారు.దీనివల్ల వారు మళ్లీ మ్యాచులు ఆడతారో లేదో అన్న సందేహం అందరిలోనూ నెలకొని ఉంది.
మరి ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
దిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో గాయపడ్డాడు.
భుజంలోని ఎముక స్థానభ్రంశం చెందడం వల్ల ఇతడు ఈ సిరీస్కు దూరమవుతాడని మొదట ప్రకటించింది బీసీసీఐ.కానీ గాయం పెద్దది కావడం వల్ల చికిత్స అవసరమని భావించిన బోర్డు ఐపీఎల్ 2021 లోనూ శ్రేయస్ పాల్గొనట్లేదని వెల్లడించింది.రాజస్థాన్ రాయల్స్కు బెన్ స్టోక్స్ ప్రధాన ఆల్రౌండర్.కానీ సీజన్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మొదటి మ్యాచ్లోనే జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది.
ఈ మ్యాచ్లో క్రిస్ గేల్ ఇచ్చిన క్యాచ్ను అందుకునే సమయంలో స్టోక్స్ ఎడమచేతి వేలు విరిగింది.దీంతో ఇతడు లీగ్ మొత్తానికి దూరమయ్యాడని ప్రకటించింది ఫ్రాంచైజీ.
తర్వాత ఇంగ్లాండ్ పయనమైన స్టోక్స్ చికిత్స తీసుకుని కోలుకుంటున్నాడు.టీమ్ఇండియా పేసర్ నటరాజన్ ఎన్నో ఆశలతో ఐపీఎల్ 2021లో అడుగుపెట్టాడు.
మొదటి రెండు మ్యాచ్లు ఆడిన ఇతడు ఆ తర్వాత గాయం కారణంగా పూర్తి లీగ్కు దూరమవుతున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది.ఇటీవలే విజయవంతంగా మోకాలి చికిత్స పూర్తి చేసుకున్న నటరాజన్ సెప్టెంబర్లో తిరిగి ప్రారంభమయ్యే లీగ్లో సత్తాచాటాలని భావిస్తున్నాడు.
రాజస్థాన్ రాయల్స్కు జోఫ్రా ఆర్చర్ గాయం మరో దెబ్బే.టీమ్ఇండియాతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడిన ఆర్చర్ లీగ్కు పూర్తిగా దూరమయ్యాడు.
ఇతడు ఇటీవలే కోలుకుని కౌంటీ క్రికెట్లో అడుగుపెట్టాడు.