ఇప్పుడిప్పుడే తెలంగాణలో క్షేత్ర స్థాయిలో బలపడాలని చూస్తున్న బీజేపీలో ఇప్పుడే కుమ్ములాటలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానాలిస్తున్నాయి.పాత నేతలతో పాటు కొత్త నేతల చేరికపై దృష్టి పెట్టిన బీజేపీ, పాత నేతల, కొత్త నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ను అంతగా పట్టించుకోవడం లేదు.
ఈ ప్రచారానికి బలం చేకూర్చే రెండు ఉదాహరణలు మనం చూసాం.పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్ రెడ్డి బీజేపీలో చేరాడు.
పెద్దపల్లిలో అత్యధిక బలం కలిగి ఉన్న మాజీ ఎంపీ వివేక్ వీరి రాకను వ్యతిరేకించారు.దీంతో అలక పూని ఆగం చంద్రశేఖర్ రెడ్డి బీజేపీ చేరిక సమావేశానికి హాజరు కాలేదు.
మరొక్క ఘటన చూస్తే రామగుండంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న సోమారపు సత్యనారాయణ ఇటీవల పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు.గత ఎన్నికల వరకు టీఆర్ఎస్ లో ఉన్న సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ తో విభేదాలతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
కాని ఇప్పుడు సోమారపు సత్యనారాయణకు స్థానిక బీజేపీ నేతలు సహకరించడం లేదని బీజేపీకి రాజీనామా చేశారు.ఇలా ఇంకా యుద్దాన్ని మొదలు చేయకుండానే కుమ్ములాటలు మొదలైతే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా ఉంది.