ఏపీలో చిత్ర విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయి.మొన్నటి వరకు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేంత వాడీ వేడీగా జరిగిన రాజకీయాలు కాస్తా ఒక్కసారిగా మారిపోయాయి.అయితే వైసీపీ అంచనా ప్రకారం.తాము మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకున్నామని, పైగా కుప్పంలో గెలిచాం కాబట్టి దాన్ని చూపించి చంద్రబాబు ఇమేజ్ను తగ్గించేయాలని అనుకున్నారు.
కానీ చంద్రబాబు తన ఎమోషనల్ కన్నీళ్లతో సీన్ను మార్చేశారు.అందరూ చంద్రబాబు మీద సింపతీ చూపించేలా రాజకీయ వ్యూహాన్ని మార్చేశారు.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆయన ఎమోషనల్ మూమెంట్ పెద్ద హాట్ టాపిక్ అవుతోంది.ఇంకోవైపు వైసీపీ మీద విమర్శలు కూడా వస్తున్నాయి.
చంద్రబాబు కన్నీళ్లతో నందమూరి కుటుంబం మొత్తం ఏకతాటి మీదకు వచ్చి ఆయనకు మద్దతు తెలపడంతో పాటు వైసీపీమీద విరుచుకు పడటం బాగా కలిసి వచ్చింది.ఇంకోవైపు రజినీకాంత్, సోనూసూద్ లాంటి వారు ఫోన్లు చేసి పరామర్శించడం కూడా టీడీపీకి ప్లస్ పాయింట్ వచ్చింది.
దీంతో అచ్చెన్నాయుడు రంగంలోకి దిగిపోయి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసేస్తున్నారు.మొన్నటి వరకు కాస్త సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు ఒక్క సారిగా స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు.
ఇక రెండున్నరేండ్లు మాత్రమే మిగిలి ఉందని రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని అప్పుడే ప్రకటించేస్తున్నారు.కచ్చితంగా వైసీపీ మీద బదులు తీర్చుకుంటామని చెప్పేస్తున్నారు.ఈ ప్రకటనలను బట్టి నిజంగానే టీడీపీకి అంత పెద్దగా ప్లస్ అయిందా అని నిపుణులు అంచనా వేస్తున్నారు.చంద్రబాబు కన్నీళ్లు రాబోయే రెండున్నరేండ్లకు సరిపోతాయన్న మాట కూడా కేడర్ నుంచి వినిపిస్తోంది.
కానీ అచ్చెన్నాయుడు మాటలు మాత్రం అప్పుడే తాము అధికారంలోకి వచ్చేసినట్టు ఉన్నాయి.ఈ మాటలు కేడర్ లో జోష్ పెంచుతాయా.
రాబోయే కాలం ఎలా ఉంటుందో చూడాలి.