ఇప్పటివరకు అందరికీ తెలిసి నంత వరకు జాతి పిత మహాత్మా గాంధీ గారు గాడ్సే చేతిలో కన్ను మూసినట్లు తెలుసు.కానీ ఆయన ఆత్మహత్య చేసుకున్నారు, అన్న ప్రశ్న మీకు ఎదురైతే పరిస్థితి ఏంటి మీరు ఏమని సమాధానం చెబుతారు.
అసలు ఎదో అచ్చు తప్పులు పుస్తకాల్లో పడుతుండడం సహజం కానీ మరి ఇంతలా జాతి పిత అయిన మహాత్మా గాంధీ గురించి ఇలాంటి తప్పుడు ప్రశ్నలు ప్రచురించడం దారుణం.ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే…గుజరాత్ గాంధీనగర్లోని సుఫలాంశాల వికాస్ సంకుల్ అనే పాఠశాల ఉంది.అయితే ఆ పాఠశాల లో 9వ తరగతి ఇంటర్నల్ పరీక్షల్లో భాగంగా ఆ విద్యార్థులను ఒక ప్రశ్న వేశారు.
అదే ‘గాంధీజీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు’.? అనే ప్రశ్న అటు విద్యార్థుల తో పాటు విద్యాశాఖ కూడా అవాక్కయ్యింది.మరోపక్క 12వ తరగతి వారికి కూడా ‘మద్యం విక్రయాలను ఎలా పెంపొందించాలో వివరిస్తూ లేఖ రాయమని అడిగారు.?, అయితే విద్యార్థులకు ఇలాంటి ప్రశ్నలు అడగడం ఏంటి అని విద్యాశాఖ అధికారులు మండిపడుతున్నారు.
ఈ అంశం పై ఒక అధికారి మాట్లాడుతూ గవర్నమెంట్ గ్రాంట్స్తో రన్ చేస్తున్న సుఫలాంశాల వికాస్ సంకుల్ లాంటి పాఠశాలలో నాణ్యమైన భోదన ఉండదని ప్రశ్నపత్రాలు కూడా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్లే రూపొందిస్తారని,అందుకే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నట్లు చెప్పారు.ఈ ప్రశ్నపత్రాలతో రాష్ట్ర విద్యాశాఖకు ఎటువంటి సంబంధం లేదని, ఈ అంశం పై ఆ పాఠశాల పై ఎంక్వయిరీకి జిల్లా డీఈఓ భరత్ వధేరా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.