రాజకీయాలలో వారసత్వం అన్నది చాలా సాధారణమైన విషయం.ఎందుకంటే తండ్రి వారసత్వాన్ని చేపట్టి ప్రముఖ రాజకీయ నాయకులుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీ ఆర్ రాజకీయ వారసునిగా కెటీఆర్ ఉన్న విషయం తెలిసిందే.అయితే అప్పట్లో కెటీఆర్ ను సీఎం చేస్తున్నరనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగిన విషయం తెలిసిందే.
అయితే త్వరలో కెసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్తున్నాడన్న సమాచారం వెలువడుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులలో కెటీఆర్ సీఎం పదవి అంశం తెర మీదికి తీసుకురావద్దనే నిర్ణయానికి కెసీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఎందుకంటే మరల సార్వత్రిక ఎన్నిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య భీకర పోటీ ఉండనున్న నేపథ్యంలో కెటీఆర్ అంశం తెర మీదికి వస్తే టీఆర్ఎస్ కు నష్టం జరిగే అవకాశం ఉండనున్న నేపథ్యంలో ఈ ప్రస్తావన రాకుండా ఎన్నికల ప్రచారం జరిగే అవకాశం ఉంది.
అయితే కెటీఆర్ కు సీఎం పదవి అందని ద్రాక్షలా మిగిలే అవకాశం ఉంది అయితే మూడో సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే మరల ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది.లేకపోతే అప్పటి వరకు కెటీఆర్ అంశం ప్రచారంలోకి వచ్చే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.