తెలంగాణ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.వరి ధాన్యం రాజకీయం ఇటు టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య జోరుగా మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.
అయితే రాజకీయ చాణక్యుడైన కెసీఆర్ తో బీజేపీ తలపడుతున్న పరిస్థితి ఉంది.అయితే రెండు సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన పరిస్థితిలో ఇక మూడో సారి కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుపొందితే ఇక ప్రతిపక్షాలు ఇక మరింత బలహీన పడిపోవడం ఖాయం.
ఎందుకంటే ఇక మూడో సారి అధికారంలోకి రావాలంటే ఇక టీ ఆర్ఎస్ పెద్ద ఎత్తున పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.అంత పోటీలో కూడా టీఆర్ఎస్ గెలిస్తే ఇక మరో ప్రభంజనమే అని చెప్పవచ్చు.
అయితే ప్రస్తుతం బీజేపీ టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత కలిగించడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
అయితే వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కెసీఆర్ బీజేపీని దోషిగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యడా అంటే ఇప్పుడే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది.
ఎందుకంటే బీజేపీని తన సవాళ్ళతో ఇరుకున పెట్టిన కెసీఆర్ దానికి కొనసాగింపుగా ధర్నా కావచ్చు ఇంకా భవిష్యత్ కార్యాచరణ విషయంలో ప్రజల నుండి వచ్చే స్పందన ఆధారంగా మాత్రమే మనం ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంది.నిన్నటి కెసీఆర్ సవాల్ కు ఇప్పటి వరకు బీజేపీ నుండి స్పష్టమైన సమాధానం రాలేదు.
అయితే ఇది టీఆర్ఎస్ సాధించిన మొదటి విజయంగా టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది.కెసీఆర్ ట్రాప్ లో బీజేపీ నేతలు పడ్డారని ఇక తప్పించుకోలేరనే చర్చ టీఆర్ఎస్ వర్గాలలో సాగుతోంది.ఏది ఏమైనా రేపటి ధర్నాతో ఒక్కసారిగా బీజేపీపై కెసీఆర్ విరుచుక పడే అవకాశం ఉంది.