తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది.సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజ్రుంభిస్తోంది.
అయితే లాక్ డౌన్ అనంతరం ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఆర్థిక లోటు నుండి కోలుకుంటోంది.అయితే మొదటి లాక్ డౌన్ లో విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో బంద్ చేయటం వల్ల విద్యార్థులు కరోనా బారిన పడే ప్రమాదం తప్పింది.
అయితే లాక్ డౌన్ అనంతరం ఇటీవలే విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమైన పరిస్థితులలో విద్యార్థులు కరోనా బారినపడిన పడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మెడికల్ కాలేజీలు మినహా విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఈ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.లాక్ డౌన్ సమయంలో ప్రయివేట్ టీచర్లు ఉపాధి కోల్పోయి కుటుంబాలను పోషించలేక ఎంతగా ఇబ్బంది పడ్డారో మనం చూసాం.
అయితే ఇప్పుడు మరల విద్యాసంస్థల మూసివేతతో మళ్ళీ ప్రయివేట్ టీచర్లు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుండడంతో ప్రైవేట్ టీచర్లు ఆందోళనకు దిగుతున్నారు.అయితే ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ,30 శాతం ఫిట్ మెంట్ ప్రకటించిన కేసీఆర్, ప్రయివేట్ టీచర్ల నోట్లో మట్టికొట్టాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులలో కేసీఆర్ ఎటువంటి నిర్ణయం
.