టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న స్టార్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.ఈయన ప్రొడ్యూసర్ గా మంచి విజయం సాధించాడు.
ఈయన చేసే ప్రతీ సినిమా తన లెక్కల ప్రకారం బడ్జెట్ వేస్తూ ఎక్కడ లెక్క తప్పకుండ పక్కా ప్లాన్ తో బరిలోకి దిగుతాడు.ఈయన బడ్జెట్ విషయంలో ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటాడు.
అయితే మొదటిసారి దిల్ రాజు తన బడ్జెట్ లెక్కల విషయంలో ప్లాన్ బెడిసి కొట్టిందా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది.అది కూడా తన మొదటి తమిళ్ సినిమా.
వారసుడు సినిమాతో దిల్ రాజు కోలీవుడ్ లోకి ప్రొడ్యూసర్ గా పరిచయం కాబోతున్నాడు.మరి ఈ సినిమా బడ్జెట్ విషయంలో రాజుగారి లెక్క తప్పింది అంటూ తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.
ప్రెజెంట్ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాల్లో తమిళ్ సినిమా ‘వరిసు’ కూడా ఉంది.టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కాంబోలో ‘వారసుడు’ సినిమా తెరకెక్కుతుంది.
దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
వంశీ పైడిపల్లి ఇప్పటి వరకు ఏ సినిమాను కూడా అనుకున్న సమయంలో పూర్తి చేయలేదు.ఇక ఇప్పుడు వారసుడు విషయంలో కూడా అనుకున్న సమయం కంటే 50 రోజులు ఎక్కువ తీసుకోవడంతో బడ్జెట్ కూడా అనుకున్నదాని కంటే 30 కోట్లు ఎక్కువ అయ్యిందట.అయితే విజయ్ క్రేజ్ కారణమా అన్ని రకాల రైట్స్ కలిపి ఇప్పటికే దిల్ రాజు 50 కోట్ల ప్రాఫిట్స్ లో ఉన్నారట.
అందుకే ఈ సినిమా వల్ల రాజుగారికి ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం అయితే కనిపించడం లేదు.చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో.