2014 లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షా లు దేశ రాజకీయ ముఖ చిత్రం మార్చడమే లక్ష్యంగా అన్నట్లుగా రాష్ట్రాల్లో అధికారాలు దక్కించుకున్నారు.
ఎక్కువ చోట్ల బీజేపీ సొంత కష్టంతో అధికారాన్ని దక్కించుకోగా.కొన్ని చోట్ల మిత్ర పక్షాలతో అధికారంను దక్కించుకున్న విషయం తెల్సిందే.
ఇక కొన్ని రాష్ట్రాల్లో మూడవ పద్దతిని అనుసరించి అధికారంను దక్కించుకోవడం జరిగింది.ఆ పరిణామాలు ప్రజాస్వామ్య రాజకీయాలకు అస్సలు సెట్ అవ్వవు అంటూ ఎంత మంది చెప్పినా కూడా బీజేపీ మాత్రం వినిపించుకోలేదు.
అక్రమంగా అధికారాన్ని దక్కించుకోవడం కోసం బీజేపీ( BJP ) వేసిన రాజకీయ ఎత్తుగడలు చాలానే ఉన్నాయి అంటూ విపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తూ ఉంటారు.ఆ విషయం పక్కన పెడితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.
కర్ణాటకలో సంపూర్ణ మెజార్టీ తో గెలిచిన కాంగ్రెస్ పార్టీని( Congress ) కాదని తాము అధికారంలో ఉండాలనే పట్టుదలతో బీజేపీ ముందడుగులు వేసింది అంటూ కొన్ని కన్నడ మీడియా సంస్థ లు కథనాలు ప్రచురితం చేశాయి.కొన్ని మాత్రం వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉండగా ఇలాంటి సమయంలో కర్ణాటకలో రాజకీయం చేయడం వల్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కనుక మోడీ అమిత్ షా( Amit Shah ) లు ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటకలో రాజకీయ వ్యూహం గురించి ఆలోచించి ఉండరు అనేది కొందరి మాట.మొత్తానికి కర్ణాటకలో అధికారం కోసం బీజేపీ ఆసక్తిగా లేదు.కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది.కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య మంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇద్దరు ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.