రాజకీయాల్లో దూకుడుగా ఉండటం ఎంత ముఖ్యమో, అంతే జాగ్రత్తగా వ్యూహాత్మకంగా నడుచుకోవటం కూడా చాలా ముఖ్యం.ఒకే విధంగా దూకుడుగా వెళ్తే ఇతర పార్టీలకు పావులుగా మారే ప్రమాదం ఉంటుంది.
ఇక ఆ తరువాత పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.తద్వారా క్షేత్ర స్థాయిలో క్యాడర్ నిరాశలో మునిగి ఉండి ప్రభుత్వంపై పోరాటానికి పార్టీ ఇచ్చే పిలుపుకు పెద్దగా స్పందించే అవకాశం చాలా తక్కువ.
అచ్చం ఇలానే ఉంది ప్రస్తుత బీజేపీ పరిస్థితి ఉంది.ఒకే విధంగా దూకుడుగా వెళ్ళి ప్రజల్లో ప్రభుత్వం వ్యతిరేకత వచ్చేలా ప్రయత్నించి ఒక్కసారిగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో కెసీఆర్ కు చిక్కడంతో స్థానికంగా బీజేపీ నాయకులను రైతులను తరిమిన ఘటనలు మనం నల్గొండలో చూశాం.
ఇక ఆ తరువాత బీజేపీ కెసీఆర్ విసిరిన సవాల్ పై ప్రతి సవాల్ విసరకపోగా ఆ తరువాత ఎంతో కొంత ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రయత్నించినా కెసీఆర్ వ్యాఖ్యలు వెళ్లినంత బలంగా వెళ్లని పరిస్థితి ఉంది.
దీంతో ఇక బీజేపీ నేతలు చాలా ఆచితూచి స్పందిస్తున్న పరిస్థితి ఉంది.
ఇలా ఆచితూచి స్పందించడానికి గల కారణం బండి సంజయ్ వ్యాఖ్యలు.బండి సంజయ్ వ్యాఖ్యలు ఏకంగా దేశ వ్యాప్తంగా బీజేపీని ఇరుకున పెట్టేలా ఉండటంతో కేంద్రం నుండి బండి సంజయ్ కి వార్నింగ్ వచ్చినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఈ వ్యాఖ్యలపై పెద్దగా బీజేపీ నేతలు స్పందించకున్నా జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించలేదు.అంతేకాక ప్రస్తుతం కెసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిశాక కెసీఆర్ చేసే ప్రకటనతో బీజేపీ మరింత ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది.
ఏది ఏమైనా మరో వ్యూహంతో ముందుకొస్తుందా లేక కెసీఆర్ వ్యూహంలో చిక్కుకుంటుందా అనేది చూడాల్సి ఉంది.