హైదరాబాదీలో పెట్టిన అందాల పోటీలలో పాల్గొని అటునుంచి అటు బాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చి అక్కడే సెటిల్ అయిపోయిన భామ దియా మీర్జా.ఇండియన్ సినిమాలో ఈమె గురించి తెలియని వారు ఉండరు.
చేసిన సినిమాలు తక్కువే అయినా సోషల్ అవేర్ నెస్ యాక్టివిటీస్ లో ఎక్కువగా దియా మిర్జా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది.అలాగే తన ఫేంని ఉపయోగించుకొని సోషల్ మీడియా సామాజిక అంశాల మీద కూడా స్పందిస్తూ ఉంటుంది.
అన్నింటికీ మించి మంచి నేచరాల్ లవర్.ప్రకృతి పరిరక్షణ కార్యక్రమాలలో దియా మీర్జా భాగం అవుతూ ఉంటుంది.
అందం, అభినయం ఉన్నా కూడా బాలీవుడ్ లో అనుకున్న స్థాయిలో ఈ అమ్మడు సక్సెస్ సాధించలేకపోయింది.అయితే ఇన్నేళ్ళ ఆమె కెరియర్ లో పక్కా హైదరాబాదీ అయినా కూడా తెలుగు సినిమాలు కూడా చేయలేదు.నటిగా ఈమె ఎంట్రీ ఇచ్చింది మాత్రం తమిళ్ సినిమాతో కావడం విశేషం.20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న అమ్మడు ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో నాగార్జున భార్యగా దియా మీర్జా నటించింది.ఇదిలా ఉంటే ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ లో దియా మీర్జా పాల్గొని టాలీవుడ్ ఎంట్రీ గురించి, తమ అభిమాన హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.స్వతహాగా హైదరాబాదీని అయినా తెలుగులో నటించే అవకాశం రావడానికి చాలా సమయం పట్టింది.
నేను నాగార్జున, వెంకటేష్ కి అభిమానిని.ఈ అభిమానమే నాగార్జున ఫ్యామిలీకి దగ్గరయ్యేలా చేసింది.
తన అభిమాన హీరోలలో ఒకరైన నాగార్జునతో వైల్డ్ డాగ్ సినిమా ద్వారా నటించే అవకాశం వచ్చింది.ఇక టాలీవుడ్ లో నాకు భాగా ఇష్టమైన నా ఫేవరేట్ హీరో వెంకటేష్ తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అని దియా మీర్జా పేర్కొంది.