నాగార్జునకి జోడీగా వైల్డ్ డాగ్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ దియా మీర్జా.ఈ అమ్మడు స్వతహాగా హైదరాబాదీ అయినా మిస్ ఆసియా పసిఫిక్ గా ప్రపంచ అందాల పోటీలలో గుర్తింపు దక్కించుకుంది.
తర్వాత ముంబైలో సెటిల్ అయ్యి అక్కడ మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇక అప్పటి నుంచి బాలీవుడ్ సినిమాలకే ఈ భామ పరిమితం అయ్యింది.
అడపాదడపా హిందీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకి కనిపిస్తుంది.అందాల పోటీలల రాణించిన భామలు తరువాత సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ అయ్యారు.
అయితే దియా మీర్జాకి మాత్రం ఎందుకనో అదృష్టం వరించలేదు.ఆమె బాలీవుడ్ లో అనుకున్న స్థాయిలో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.
అయితే అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.చాలా కాలం తర్వాత ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాతో ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.
ఈ సినిమాలో నాగార్జున భార్య పాత్రలో దియా మీర్జా కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన పెళ్లి వేడుకని షేర్ చేసుకుంది.
దాంతో పాటు రీసెంట్ గా మరో ఆర్టికల్ ని కూడా షేర్ చేసింది.వాతావరణంలో కాలుష్యం ఎక్కువ కావడం వలన మగాళ్ళలో లైంగిక సామర్ధ్యం పడిపోతుందని, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని ఇటీవల శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా తేల్చారు.
దీనికి సంబందించిన ఆర్టికల్ ని ఆమె తన ట్విట్టర్ లో షేర్ చేసింది.దాంతో పాటు ఒక ట్వీట్ కూడా చేసింది.ఇప్పటికైనా ప్రపంచ దేశాలు వాతావరణ మార్పులు, వాయు కాలుష్యంపైన దృష్టి పెడతారని అనుకుంటున్నా అంటూ పోస్ట్ చేసింది.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.