బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేసింది.ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దియా మీర్జా తన మిస్ ఇండియా రోజులకు సంబంధించిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.అయితే ఈ ఫోటోలో ఒక విశేషం కూడా ఉంది.అదేమిటంటే దియామీర్జా షేర్ చేసిన ఫోటోలో ఆమెతో పాటు లారా దత్తా, ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు.2000 సంవత్సరపు అలనాటి జ్ఞాపకం అంటూ.దియా ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ ఫోటో కాస్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ఈ ఫోటో పై లారా దత్తా స్పందించింది.
గుండెల నిండా కలల్ని నింపుకున్న ముగ్గురు అమ్మాయిలు.ఒకరికి అండగా మరొకరు.అంటూ వారితో బ్యాక్ పిక్ పై స్పందించింది దియా షేర్ చేసిన ఈ 2000 సంవత్సరం నాటి ఫోటో అంటే దాదాపుగా 22 ఏళ్ళ ఫోటో షేర్ చేయడం పై నెటిజన్స్ లో పలు అనుమానాలకు కారణం అవుతోంది.2000 సంవత్సరం లో మిస్ ఇండియా కాంపిటీషన్స్ కు హాజరైన దియా మీర్జా, ప్రియాంక చోప్రా, లారా దత్తా ముగ్గురు కూడా వారి అందాలతో ఆహా అనిపించారు.ఈ క్రమంలోనే మిస్ వరల్డ్ గా ప్రియాంక చోప్రా ఆ తర్వాత బాలీవుడ్ లో సత్తా ను చాటుకుంది.ఇకపోతే ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా తన అంటే ఏంటో నిరూపించుకునే పనిలో ఉంది.
ఇక లారా దత్తా మిస్ యూనివర్స్ గా ఎంపిక అయిన తర్వాత బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించింది.అనంతరం టెన్నిస్ స్టార్ మహేష్ భూపతిని పెళ్లి చేసుకుంది.ఇకపోతే ప్రస్తుతం లారా వెబ్ సిరీస్ లో నటిస్తూ అలరిస్తోంది.దియా మీర్జా విషయానికి వస్తే ఈమె రెండు దశాబ్దాల క్రితం మిస్ ఏసియా పసిఫిక్ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది.
ఈమెకు నటిగా ఆశించినంత విజయం దక్కలేదు.ఇటీవలే ఈమె వివాహం చేసుకొని ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.