బాలీవుడ్ లో ఇటీవల విడాకుల గోల ఎక్కువైపోయింది.ఆమధ్య అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా లు విడాకులు తీసుకొని హాట్ టాపిక్ గా మారిన తెలిసిందే.అయితే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది.11 ఏళ్ళు కలిసున్న తర్వాత ఇక ఉండలేమని నిర్ణయించుకుని విడిపోతున్నారట.ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే హిందీలో దాదాపు 30 సినిమాలకు పైగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి దియా మీర్జా.ఇప్పుడు తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది.2014లో ఢిల్లీ బిజినెస్ మెన్ సాహిల్ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకున్న మీర్జా 5 ఏళ్లకు అతని నుంచి విడాకులు కోరుకుంటుంది.వారు పెళ్ళికి ముందే సహజీవనం పేరుతో జీవించారు.
ఆ తరువాత ఇరు కుటుంబాల అంగీకారం తో అక్టోబర్ 2014 లో పెళ్లి చేసుకున్న ఈ జంట మొత్తంగా 11 ఏళ్ళు గా కలిసి ఉంటున్నారు.
అయితే 11 ఏళ్ల తరువాత ఇక ఇప్పుడు విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది దియా.11 ఏళ్లు తనతో జీవితం పంచుకున్నాను,ఒకరి కోసం ఒకరు బతికాం ఇప్పుడు పరస్పరం ఒప్పందంతోనే విడిపోతున్నాంటూ ఆ లేఖ లో రాసుకొచ్చింది.ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.