‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రాన్ని నిర్మించిన జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్, మోహన్ రూపా ఫిలింస్ సంస్థలు సంక్రాంతి తర్వాత రమేష్ అనే కొత్త దర్శకుడితో ‘వాడే వీడు’ అనే క్రైమ్ కామెడి థ్రిల్లర్ను తెరకెక్కించనున్నారు.ఈ సినిమాలో ఇద్దరి హీరోల్లో బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఒక హీరోగా నటిస్తుండగా మరో హీరోగా నారా రోహిత్ నటిస్తున్నాడు.
గతంలో ‘పల్లకిలో పెళ్ళికూతురు’,’ బసంతి’ చిత్రాల్లో నటించిన గౌతమ్కు సక్సెస్ మాత్రం అందని ద్రాక్షలా మిగిలిపోయింది.ఇప్పుడు ‘వాడేవీడు’ సినిమాపై చాలా ఆశలనే పెట్టుకున్నాడు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో గౌతమ్ ఒక దొంగగా నటిస్తుండగా అతన్ని పట్టుకునే పోలీస్ పాత్రలో నారా రోహిత్ కనిపించనున్నాడు.అంటే ఒక దొంగ-పోలీస్ మధ్య నడిచే కథే ఈ సినిమా కాన్సెప్ట్ అనేది టోటల్ సమాచారం.
పాయింట్ వినడానికి బాలీవుడ్ సక్సెస్ సీక్వెల్ ‘ధూమ్’లా అనిపిస్తుంది.కదూ బాలీవుడ్ చిత్రంలో కూడా అభిషేక్ బచ్చన్ దొంగల్ని పట్టుకునే ప్రయత్నమే బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతుంది.
మరి ‘వాడేవీడు’ ఎలాంటి సక్సెస్ను అందుకుంటుందో చూడాలి.ఈ సినిమాకు వందన అలేఖ్య జక్కం, శ్రీనివాస్ సమ్మెట, కిరీటి పోతిని నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.