ఏపీ టీడీపీలో ప్రస్తుతం నాయకుల వలసలు మొదలయినట్టుగా కనిపిస్తోంది.ముందు ముందు ఈ వలసలు మరింత జోరందుకున్నట్టు కనిపిస్తున్నాయి.
నిన్ననే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు, విజయవాడలో కీలక నాయకుడిగా ఉన్నదేవినేని అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు అదేవిధంగా గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ కూడా దాదాపుగా వైసీపీలోకి చేరేందుకు సిద్ధంగానే ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు .ఓ టీవీ డిబేట్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చంద్రబాబు, లోకేష్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ అనేక విమర్శలు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు.ఈ తలనొప్పి ఇలా ఉండగానే మరో కీలక నాయకుడు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి దీంతో తెలుగుదేశం పార్టీలో ఆందోళన రేగుతోంది.
ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గుంటూరు జిల్లాలోని పొన్నూరు పొన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు ఈ పర్యటనకు జిల్లాకు చెందిన నాయకులంతా హాజరైన పొన్నూరు మాజీ శాసనసభ్యులు దూళిపాళ్ల నరేంద్ర హాజరు కాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది గత ఎన్నికలకు ముందు వరకు వరుసగా ఐదుసార్లు గెలిచిన నరేంద్ర గత ఎన్నికల్లో ఓటమి చెందినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.లోకేష్ తన నియోజకవర్గంలో స్వయంగా పర్యటించినా నరేంద్ర హాజరు హాజరు కాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇదంతా చేస్తున్నారా అందుకే లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
పొన్నూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు రవి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు లోకేష్ పొన్నూరు వచ్చారు.అయితే నరేంద్ర అయ్యప్ప మాలలో ఉన్నందున పరామర్శకు రాకూడదన్న ఉద్దేశంతోనే లోకేష్ పర్యటనకు హాజరు కాలేదని, దీని వెనకాల మారే ఉద్దేశం లేదని ఆయన అనుచరులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.అయినా ఆయన మీద అనుమానాలు మాత్రం టిడిపి అధిష్టానానికి పోవడంలేదు.దీంతో రహస్యంగా అక్కడి పరిణామాలను తెలుసుకునేందుకు టిడిపి అంతర్గత విచారణ మొదలు పెట్టింది.ఇంత జరుగుతున్నా నరేంద్ర మాత్రం ఇప్పటివరకు ఈ విషయం గురించి నోరు మెదపలేదు.దీని అర్థం ఏమై ఉంటుందా అనే కోణాల్లో విశ్లేషణలు జరుగుతున్నాయి.