దేశంలో ఎవరిని విడిచి పెట్టడం లేదు మహమ్మారి కరోనా.
సెకండ్ వేవ్ తీవ్రత
ఇండియాలో చాలా దారుణంగా ఉంది.మూడు లక్షలకు దగ్గరలో కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావటం మరోపక్క హాస్పిటల్స్ లో బెడ్లు కొరత మాత్రమే కాక ఆక్సిజన్ కొరత కూడా ఉండటంతో కరోనా బారిన పడుతున్న రోగులు అనేక అవస్థలు పడుతున్నారు.పరిస్థితి ఇలా ఉండగా కేంద్రం వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా చేయడానికి ప్రైవేటు రంగం తో కూడా చేతులు కలపడం జరిగింది.
కాగా తాజాగా ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ టాప్ క్రికెటర్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు.దీంతో వెంటనే కుటుంబ సభ్యులు వాళ్లని ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
ధోని తండ్రి పాన్ సింగ్, తల్లి దేవకీదేవి ఇద్దరికీ పాజిటివ్ రిపోర్ట్ రావడంతో కుటుంబ సభ్యులు రాంచీలోని పల్స్ అనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది.ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ధోని ఐపీఎల్ ఆడుతున్నాడు.ఈ క్రమంలో తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకాబు చేస్తున్నారట.