ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ ను చిత్తుచేసి చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్ గా నిలిచింది.అయితే ఇప్పటివరకు ఐపీఎల్ కెరియర్ లో నాలుగుసార్లు చాంపియన్ గా నిలవగా తాజాగా 2021 సీజన్ 14 టైటిల్ ను సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ టీం ఫ్రాంచైజీ విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది.నిజానికి ఈ విజయోత్సవాలను నవంబర్ లో ఘనంగా నిర్వహించాలని, మూడవ వారంలో షెడ్యూల్ చేసింది.
అయితే కెప్టెన్ ధోనీ అందుబాటులో లేకపోవడంతో డిసెంబర్ లో విజయోత్సవాలను చెన్నైలోని చెపాక్ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి కసరత్తు చేస్తోంది.
ఈ వేడుకలకు తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
అంతేకాకుండా ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనడం ఖాయం అన్న వార్తలు వినిపిస్తున్నాయి.వైయస్ జగన్, చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ శ్రీనివాసన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, ఆ సాన్నిహిత్యం తోనే ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యత్వాన్ని కూడా కల్పించారు.
అలాగే శ్రీనివాసన్ కు చెందిన ఇండియా సిమెంట్స్, వైయస్ జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ మధ్య వ్యాపార లావాదేవీలు కూడా కొనసాగుతున్నాయి.వైయస్ జగన్ తో ఉన్న ఈ సాన్నిహిత్యంతోనే శ్రీనివాసన్ చెన్నై సూపర్ కింగ్స్ విజయోత్సవాలకు ఆయనను ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ విజయోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించడానికి ఎన్.శ్రీనివాసన్ గుంటూరు జిల్లా తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైయస్ జగన్ను కలవబోతున్నారు.తమిళనాడులో వైయస్ జగన్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే.పుట్టిన రోజు మొదలుకొని.పలు సందర్భాల్లో ఈయన పేరు మీద చాలా బ్యానర్లు వెలిశాయి.అక్కడి వారంతా వైయస్ జగన్ ను పొలిటికల్ స్టార్ గా అభివర్ణిస్తారు.
ఇక ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, ఎంఎస్ ధోని కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈ ముగ్గురు కలిసి ఒకే వేదికను పంచుకోబోతున్న సందర్భంగా ఈ వేడుకను చాలా గ్రాండ్ గా నిర్వహించడానికి యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది.