భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటి వాడు అయ్యాడు.బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి గారాలపట్టి అయిన అతియాశెట్టి వివాహం చేసుకున్నాడు.
ఖండాలాలోని సునీల్ శెట్టి ఇంట్లో వీరి వేడుక సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది.ఇక కేఎల్ రాహుల్ పెళ్లికి క్రికెటర్లు హాజరు కాలేదు.
అయితే తన సహచర క్రికెటర్ స్నేహితుల నుంచి కేఎల్ రాహుల్ ఎన్నో స్పెషల్ వెడ్డింగ్ గిఫ్ట్స్ అందుకున్నాడు.వీరిలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని రాహుల్కు అత్యంత ప్రత్యేకమైన, లగ్జరీ బహుమతిని అందించాడు.
వీటి గురించి తెలుసుకుందాం.
టీమిండియా క్రికెటర్లు చాలా స్నేహంగా ఉంటారు.
అందులోనూ జట్టులో భాగమైన కేఎల్ రాహుల్ పెళ్లి అనగానే సహచర క్రికెటర్లు హాజరు అవుతారని అంతా భావించారు.అయితే రాహుల్-అతియాశెట్టి పెళ్లి చాలా తక్కువ మంది అతిథుల సమక్షంలో నిర్వహించారు.
ఇక ఈ పెళ్లికి భారత క్రికెటర్లు హాజరు కాకపోయినా ఖరీదైన గిఫ్టులు పంపించారు.
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి రాహుల్కు విలువైన గిఫ్ట్ అందింది.రూ.2.17 కోట్ల విలువైన బిఎమ్డబ్ల్యూ కారును కేఎల్ రాహుల్కు బహుమతిగా అందించాడు.ఇక భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా పెళ్లికి హాజరు కాకపోయినా, అదిరిపోయే గిఫ్ట్ అందించాడు.రూ.80 లక్షల విలువ చేసే కవాసకి నింజా బైకును బహుమతిగా ఇచ్చాడు.ధోనికి బైక్లంటే చాలా ఇష్టం, రేసింగ్ బైక్ల పట్ల అతడికి ఉన్న ప్రేమ ఎవరికీ కనిపించదు.
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాతో సహా పలువురు టీమ్ ఇండియా ఆటగాళ్లు జనవరి 23న న్యూజిలాండ్ సిరీస్ ఉండడంతో ఈ పరిస్థితి ఎదురైంది.దీంతో ముంబైలోని ఖండాలాలో జరిగిన రాహుల్ మరియు అతియాల వివాహానికి చేరుకోలేకపోయారు.ఇక ఈ జంటకు కారు, బైక్తో పాటు సునీల్ శెట్టి ఈ జంటకు అత్యంత ప్రత్యేకమైన బహుమతిని అందించారు.
బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ముంబైలోని విలాసవంతమైన అపార్ట్మెంట్ను తన కూతురు, అల్లుడికి బహుమతిగా ఇచ్చాడు.ఈ విలాసవంతమైన ఇంటి ఖరీదు దాదాపు రూ.50 కోట్లు.