ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) 2019 వరల్డ్ కప్ అనంతరం చాలా మంది సీనియర్ ప్లేయర్స్ క్రికెట్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు.ఇక టీమిండియా జట్టులో సీనియర్ ఆటగాడిగా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోని కూడా రిటైర్మెంట్ ఇచ్చే ఆవకాశం ఉందని స్థానిక మీడియాలో రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది.
అయితే ధోని రీసెంట్ గా ఎబిపి ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్టే ఇచ్చి మరో కన్ఫ్యూజన్ లెవనెత్తాడు.*చాలా మంది శ్రీలంక తో మ్యాచ్ అయిపోగానే రిటైర్ అయిపోవాలని కోరుకుంటున్నారు.కానీ నేనెప్పుడూ రిటైల్ అవుతానో నాకే సరిగ్గా తెలియదు.ఆ విషయంలో ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేను* అని మిస్టర్ కూల్ ఆన్సర్ ఇచ్చాడు.
దీంతో మరోసారి ధోని రిటైర్మెంట్ ప్రస్తావన హాట్ టాపిక్ గా మారింది.ధోని ఆటకు వీడ్కోలు పలికితే మంచిదని ఇటీవల కొన్ని ఇన్నింగ్స్ ల కారణంగా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే ధోని వరల్డ్ కప్ ఫైనల్ ఇంకా రెండేళ్లు కొనసాగితే మంచిదని కొందరు సీనియర్ ఆటగాళ్లు సలహాలు ఇస్తున్నారు.అయితే ధోని ఈ విషయంలో ఏ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
వరల్డ్ కప్ అనంతరం ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.