మహేంద్ర సింగ్ ధోనీ అంటే తెలియని క్రికెట్ ప్రేమికుడు ఉండడు.ఒక కెప్టెన్ గా మూడు వరల్డ్ కప్ లు సాధించిన ఏకైక కెప్టెన్ గా భారత క్రికెట్ చరిత్రలో రికార్డ్ సృష్టించాడు.
మరే భారత్ కెప్టెన్ అంత సులభంగా బద్దలు కొట్టలేరన్నది క్రికెట్ పండితుల అభిప్రాయం.అయితే ధోనీ క్రికెట్ ను ఎంతగా ప్రేమిస్తాడో ఇండియన్ ఆర్మీని అంతలా గౌరవిస్తాడు.
ప్రస్తుతం ధోనీ ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్ నెంట్ కల్నల్ హోదాలో ఉన్న విషయం తెలిసిందే.క్రికెట్ నుండి విరామం ప్రకటించక ముందు కొన్ని రోజులు కల్నల్ గా విధులు నిర్వహించి వచ్చిన విషయం తెలిసిందే.
అయితే క్రికెట్ లో కూడా ఏదో ఒక రూపంలో ధోనీ ఆర్మీని క్రికెట్ లో ఏదో ఒక రూపంలో పొందుపరచి ఆర్మీ గొప్పదనాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడానికి తన వంతు కృషి చేస్తాడు.తాజాగా గత ఐపీఎల్ లో క్రికెటర్లకు ఆర్మీ క్యాప్స్ ను బహుకరించాడు.
అయితే ఈ సారి ఐపీఎల్ లోచెన్నై సూపర్ కింగ్స్ జెర్సీపై “క్యామోఫ్లాజ్” ప్రింట్ ఉన్న జెర్సీలను విడుదల చేసాడు.అయితే ఈ జెర్సీని విడుదల చేస్తున్న వీడియోను సీఎస్ కే తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ వీడియోపై రవీంద్ర జడేజా తనదైన శైలిలో కామెంట్ చేసాడు.ధోనీ భయ్యా ఎల్ సైజ్ టీషర్ట్ నాకు ఒకటి పంపు అని కామెంట్ చేసాడు.
అయితే జడేజా కామెంట్ కి రిప్లైగా సీఎస్ కే సమాధానమిస్తూ మీ కోసం సిద్ధంగా ఉంది.త్వరలో అందజేస్తాం”అని రిప్లై ఇచ్చింది.