ఐపీఎల్ అంటే చాలు చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తారు.2021 సీజన్ ఐపీఎల్ లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే చెప్పాలి.చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఆసక్తికర పరిణామం జరిగింది.దీపక్ చాహర్ తన ప్రేమను వ్యక్తపరిచాడు.చెన్నై సూపర్ కింగ్స్ గ్యాలరీకి వెళ్లిన ఆ టీమ్ స్టార్ పేసర్ దీపక్ చాహర్ తన లవర్ జయ భరద్వాజ్ కి తన ప్రేమను తెలిపాడు.మోకాలి పై కూర్చొని లవ్ ప్రపోజ్ చేయడంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిన్ను ప్రేమిస్తున్నాను.నన్ను పెళ్లిచేసుకుంటావా అని అడగడంతో అందరు ఆశ్చర్యపోయారు.
చాహర్ అలా చెప్పడంతో ఆ అమ్మాయి వాట్ అని అంటూనే అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది.దీంతో చాహర్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు.
ఆ తర్వాత అతను ఆమె వేలికి ఉంగరం తొడిగాడు.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మ్యాచ్ అయిపోయిన తర్వాత చెన్నై ఫ్యామీలీ గ్యాలరీకి వచ్చిన దీపక్ చాహర్ ధోనీ కూతురు జీవాను పక్కకు జరుపుతూ.తన లవర్ కి ప్రపోజ్ చేయడంతో అందరు ఆశ్చర్యపోయారు.టీ20 అయ్యిన వెంటనే దీపక్ చాహర్ – జయ భరద్వాజ్ ఒక్కటవుతారని సమాచారం.ఈ క్యూట్ లవ్ స్టోరీ వెనుక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపోజ్ విషయాన్ని అతను మొదటగా ఎంఎస్ ధోనీకి తెలియజేశాడు.ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రపోజ్ చేయాలని దీపక్ చాహర్కు ధోని సలహా ఇచ్చాడని తెలుస్తోంది.మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ లవ్ సీన్ చూసి అందరూ సంతోషం వ్యక్తం చేశారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ జంట సంతోషంగా ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.