బుల్లితెర జోడీ సుధీర్ రష్మీలకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.సుధీర్, రష్మీ వేర్వేరుగా చేసిన షోల కంటే కలిసి చేసిన షోలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఢీ షో ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో సుధీర్ రష్మీ మధ్య జరిగిన సంభాషణ ప్రోమోకు హైలెట్ కావడం గమనార్హం. ప్రోమోలో రష్మీ సుధీర్ కు కాల్ చేయగా సుధీర్ ఏంటి రష్మీ అని అడుగుతాడు.
రష్మీ సుధీర్ ను ఏం చేస్తున్నావ్ అని అడగగా ఏం చేయట్లేదు ఖాళీగానే ఉన్నానని సుధీర్ చెబుతాడు.రష్మీ సుధీర్ తో ఇంట్లో ఎవరూ లేరని చెప్పగా సుధీర్ తనకు రష్మీ ఏం చెబుతుందో అర్థం కావడం లేదని అంటాడు.
వెధవ సోది ఆపి ఇంటికి రా అని రష్మీ అడగగా రష్మీ ప్లీజ్ రష్మీ ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడతావని సుధీర్ చెబుతాడు.ఎందుకు ఇంటికి రా ఇంటికి రా అని కాల్స్ చేస్తావని రష్మీని సుధీర్ అడుగుతాడు.
ఆ తరువాత ఆదికి దీపికా పిల్లి కాల్ చేయగా మనకు అన్ని సంవత్సరాల కెమిస్ట్రీ లేదని తొందరగా కానిచ్చేద్దామని ఆది చెబుతాడు. నాన్నగారు ఇంట్లో లేరని ఇంటికొస్తావా అని ఆది అడగగా ఆది వస్తానని చెబుతాడు.ఏం చేద్దాం అని దీపికా పిల్లి అడగగా నాన్నగారు వచ్చేలోపు నాన్నగారిని తాతయ్యను చేద్దాం అని ఆది చెబుతాడు. ఈ నెల 21వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ఒక పాటలో రష్మీ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేయడం గమనార్హం.సుధీర్ కూడా బాగా డ్యాన్స్ చేయగా ప్రియమణి సుధీర్ కు హగ్ ఇస్తారు.రష్మీ సుధీర్ సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఈ జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.