సౌత్ ఇండియాలో నెంబర్ వన్ డ్యాన్స్ షోగా గుర్తింపు తెచ్చుకున్న డీ జోడి లో కంటెస్టెంట్ గా పాల్గొని తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన డాన్సర్ మరియు కొరియో గ్రాఫర్ పండు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే డాన్సర్ పండు ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఈ కార్యక్రమంలో భాగంగా తన ప్రేమ విషయం గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే తాను ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుంచే భవాని అనే అమ్మాయిని ప్రేమించానని ఆ విషయం అప్పట్లో భవాని ఇంట్లో వాళ్లకి తెలిసి తమని మందలించారని తెలిపాడు. దాంతో అప్పుడప్పుడు తామిద్దరూ రహస్యంగా కలసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లమని, చివరికి ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో తన ప్రేమ విషయాన్ని తన భవానికి చెప్పానని అందుకు ఆమె కూడా అంగీకరించిందని తెలిపాడు.
ఆ తర్వాత తన పై చదువుల కోసం చెన్నై కి వెళ్లానని దాంతో ఇద్దరి మధ్య కొంతమేర దూరం ఏర్పడినప్పటికీ అప్పుడప్పుడు ఫోన్ చేసి భవానితో మాట్లాడే వాడినని చెప్పుకొచ్చాడు.
అయితే సరిగ్గా తాను చదువుకుంటున్న సమయంలో డాన్స్ పై దృష్టి సారించడంతో తన ప్రియురాలితో మాట్లాడేందుకు సమయాన్ని కేటాయించలేక పోయానని దాంతో ఆమె తనని అపార్థం చేసుకుందని తెలిపాడు.
చివరికి తను ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయాన్ని తన స్నేహితుడి ద్వారా తెలుసుకున్నానని కానీ ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ చాలా బాధపడుతుంటానని తెలిపాడు.అంతేగాక భవాని లాంటి అమ్మాయి తనకి ప్రేమికురాలిగా దొరకడం చాలా అదృష్టమని కానీ ఆ అదృష్టం తనకి ఎంతో కాలం నిలవలేదని కొంతమేర ఎమోషనల్ అయ్యాడు.
కాగా ప్రస్తుతం పండు పలు చిన్న బడ్జెట్ తరహా చిత్రాలలో డాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవలే డీ జోడి లో డాన్సర్ పండు పలాస చిత్రంలోని “నక్లెస్ గొలుసు” పాటకి చేసినటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.
.