టాలీవుడ్ లో కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు శ్రీనువైట్ల.కమర్షియల్ సక్సెస్ లు అందుకొని స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శ్రీను వైట్ల తరువాత ఒక్కసారిగా డిజాస్టర్ ల బాట పట్టాడు.
బ్రూస్ లీ సినిమా నుంచి అతను చేస్తున్న సినిమాలు అన్ని డిజాస్టర్ టాక్ తోనే నడుస్తున్నాయి.ఈ నేపధ్యంలో స్టార్ హీరోలు అందరూ కూడా ఈ దర్శకుడుని పూర్తిగా పక్కన పెట్టారు.
అయితే ఢీ సినిమాతో తనకి కమర్షియల్ హిట్ ఇచ్చిన శ్రీనువైట్ల మీద మంచు విష్ణుకి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది.ఈ నేపధ్యంలో అతనితో నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం మంచు విష్ణు మోసగాళ్ళు సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.దీని తర్వాత శ్రీనువైట్లతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉంది.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి చాలా రోజులుగా ఒక న్యూస్ వినిపిస్తుంది.ఢీ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు విష్ణు, శ్రీను వైట్ల సినిమా ఉండబోతుందనే చర్చ నడిచింది.
వారిద్దరి కలయికలో రాబోతున్న సినిమాకి ఢీ అండ్ ఢీ అనే టైటిల్ పెట్టి ప్రీలుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.ఈ నేపధ్యంలో ఢీ సీక్వెల్ గా ఆ సినిమా ఉంటుందనే మాట వినిపించింది.
మొదటి సినిమాలో ఉండే పాత్రలు కొనసాగింపుగా కథ ఉండే అవకాశం ఉందని టాక్ నడిచింది.అయితే ఈ టాక్ కి తాజాగా శ్రీను వైట్ల ఫుల్ స్టాప్ పెట్టాడు.
మంచువిష్ణుతో చేయబోతున్న కొత్త సినిమా ఢీకి సీక్వెల్ కాదని, టైటిల్ ని మాత్రమే ఉపయోగించుకొని పూర్తి కొత్త కథతో చేస్తున్నామని చెప్పుకొచ్చాడు.అలాగే ఆ సినిమా తరహాలోనే అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ తోనే ఈ సినిమా కథ కూడా ఉంటుందని చెప్పాడు.
ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపాడు.