పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.సంగ్రూర్ నిరసనలతో హోరెత్తుతోంది.
సంగ్రూర్ లోని సీఎం నివాసం ఎదుట రైతు సంఘాలు ధర్నాకు దిగాయి.ముఖ్యమంత్రి స్పందించి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆందోళన కారులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.పరిస్థితి సద్దుమణగకపోవడంతో నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారని సమాచారం.నిరసనకారుల నినాదాలు, పోలీసుల లాఠీచార్జ్ తో ఉద్రిక్తత నెలకొంది.