వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రోజు రోజుకీ ముదురుతోంది.ప్రైవేటీకరణ గ్యారెంటీ అని కేంద్ర ప్రభుత్వం.
దూకుడుగా వ్యవహరిస్తోంది.మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్టీలు ప్రైవేటీకరణ ఆపటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలుకూడా ఈ విషయంలో కృషి చేస్తూ ఉన్నారు.మరో పక్క విశాఖ ఉక్కు కార్మికులు విశాఖపట్టణంలో ధర్నాలు నిరసనలు చేపడుతున్న తాజాగా.
ఢిల్లీలో చేరుకుని ధర్నాలు నిర్వహిస్తున్నారు.
జంతర్ మంతర్ వద్ద తోపాటుఏపీ తెలంగాణ భవన్ వద్దవిశాఖ ఉక్కు కార్మికులు నిరసనలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు అనేక ఇబ్బందులకి గురిచేస్తున్నారన ఉద్యమకారులు మండిపడుతున్నారు.కార్మికులు వందలాది మంది మద్దతుదారులు ఎలాగైనా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో కార్మిక సంఘాలతో పాటు వచ్చిన మద్దతుదారులను ఢిల్లీ పోలీసులు అనేక ప్రశ్నలు వేసినట్లు సమాచారం.రైతుల పోరాటానికి వచ్చినట్లు భావిస్తూకొన్ని గంటల పాటు నిర్బంధించారట.
ఆ తర్వాత వదిలి వేయడం జరిగిందట.