టాలీవుడ్ లో ఎప్పటి నుంచో హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న నటి ధన్య బాలకృష్ణ.సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో చిన్న పాత్రతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అడపాదడపా హీరోయిన్ గా సినిమాలు చేస్తూ వస్తుంది.
ఈమె చివరిగా జబర్దస్త్ సుదీర్ హీరోగా తెరకెక్కిన సాఫ్ట్ వేర్ సుదీర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.
అయితే చిన్న సినిమాలకి ఈ భామని హీరోయిన్ గా ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారు.అనుకున్న స్థాయిలో గ్లామర్ అందాల ప్రదర్శన చేయకపోయినా పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ అమ్మడు కెరియర్ ప్రారంభించి ఇప్పటి వరకు 23 సినిమాలు చేసింది.
ప్రస్తుతం అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి అనే రొమాంటిక్ ఫిమేల్ ఎంటర్టైన్మెంట్ మూవీతో ఈ భామ త్వరలో మరో ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధన్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
భవిష్యత్తులో తాను దర్శకురాలిగా మారుతానని, తన ఫస్ట్ సినిమానే లేడీ ఒరియాంటెడ్ కథతో ఉంటుందని చెప్పింది.ప్రముఖ దర్శకులు బాలాజీ మోహన్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన అనుభవం తనకి ఉందని, అందుకే భవిష్యత్తులో కచ్చితంగా దర్శకురాలిగా సత్తా చాటుతానని చెప్పింది.
మరి ఈ అమ్మడు కోరిక ఎప్పటికి తీరుతుందో, ఈమెని నమ్మి ఎవరు డబ్బు పెట్టడానికి ముందుకొస్తారు అనేది వేచి చూడాలి.