తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగి రోజురోజుకూ ఆడియెన్స్ ను పెంచుకుంటూ పోతున్నాడు ధనుష్.ఈయన సినిమాలంటే తమిళ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
వరుసగా హిట్స్ కొడుతూ దూసుకు పోతున్నాడు.ధనుష్ సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి.
కానీ ఈసారి ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమాలో కూడా నటించడానికి రెడీ అయ్యాడు.
డైరెక్ట్ తెలుగు సినిమా అయితే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యేందుకు అవకాశాలు ఉన్నందున ధనుష్ తెలుగు సినిమాను ఒప్పుకున్నాడు.
ఇప్పటి వరకు ఎప్పుడు డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను పలకరించిన ధనుష్ ఇప్పుడు స్ట్రైట్ మూవీ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో చిత్రంతో తన డైరెక్ట్ గా తెలుగు సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.
ఇక ఈ సినిమాను తొలిప్రేమ సినిమా తీసిన డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనుంది.సూర్యదేవర నాగ వంశి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.
ఇక ఈ సినిమా టైటిల్ సార్ అని ఫిక్స్ చేసారు.ఈ సినిమా కంటే ముందే ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నాడు.
కానీ ముందు వెంకీ అట్లూరి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి అవుతుంది.
ఈ రెండు సినిమాలు వేగంగా పూర్తి చేయనున్నాడు.ఈ రెండు సినిమాలు చేస్తూనే మరొక సినిమాకు కూడా కమిట్ అయినట్టు తెలుస్తుంది.టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ధనుష్ ఒక సినిమా చేయనున్నాడట.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా టాక్ బయటకు వచ్చింది.ధనుష్ కి తగిన స్టోరీ దిల్ రాజు రెడీ చేయించాడని త్వరలోనే ఈ సినిమా కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మొత్తానికి కోలీవుడ్ స్టార్ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.