జాతీయ నటుడిగా అవార్డు అందుకున్న నటుడు ధనుష్ గురించి తెలియని ప్రేక్షకులు లేరు.ఈయన కోలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరు.
నేషనల్ అవార్డు అందుకున్న ఈయన నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రెజెంట్ ధనుష్ కోలీవుడ్ లో సినిమాలు చేస్తూనే అటు తెలుగుతో పాటు హిందీ, హాలీవుడ్ మూవీస్ లో కూడా తనని తాను నిరూపించు కునేందుకు తీవ్రంగా కష్టపడు తున్నాడు.
ధనుష్ నటిస్తున్న సినిమాలన్నీ డబ్బింగ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి.కానీ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు.ప్రెసెంట్ ధనుష్ తెలుగులో రెండు సినిమాలు ప్రకటించాడు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాడు.
ఈ సినిమా పట్టాలెక్కక ముందే మరో డైరెక్టర్ తో సినిమా ప్రకటించి షూటింగ్ కూడా స్టార్ట్ చేసాడు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ సినిమా స్టార్ట్ చేసాడు.‘సార్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.
ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయగా అందరిని ఆకట్టుకుంది.సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ, సౌజన్య త్రివిక్రమ్ నిర్మిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ జరుపు కుంటూనే మరోపక్క రెండు భాషల్లో డబ్బింగ్ కూడా జరుగుతుందట.ధనుష్ తమిళ్ డబ్బింగ్ ను అయితే ఎంతో ఎంజాయ్ చేస్తూ చెప్పాడట.కానీ తెలుగు డబ్బింగ్ కు వచ్చే సరికి ఈయన ఏదో మొక్కుబడిగా చెప్పుకొస్తున్నాడట.
దీంతో డబ్బింగ్ తేలిపోతుండడంతో టీమ్ అంతా ఆందోళన చెందుతున్నారని టాక్ బయటకు వచ్చింది.ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక ఈ సినిమా అక్టోబర్ 13న రిలీజ్ చేయబోతున్నారు.