తమిళంలో పాటు తెలుగులో కూడా తనకంటూ ఓ ఇమేజ్ దక్కించుకున్న టువంటి విఐపి ధనుష్ గురించి తెలుగు పరిశ్రమలో పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రస్తుతం ధనుష్ హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.
అయితే తాజాగా తమిళంలో ధనుష్ నటించిన టువంటి పటాస్ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది.అంతేకాక ఈ చిత్రం మంచి వసూళ్లను కూడా సాధించింది.
దాంతో ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.అంతేగాక ఈ చిత్రానికి లోకల్ భాయ్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.
ఈ చిత్రంలో ధనుష్ సరసన మెహ్రీన్ పిర్జాదా నటించగా తెలుగు నటుడు నవీన్ చంద్ర విలన్ పాత్రలో నటిస్తున్నాడు.అలాగే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సీనియర్ నటి స్నేహ నటించారు.
అయితే గతంలో వచ్చినటువంటి ధనుష్ చిత్రాలు తెలుగులో మంచి వసూళ్లను సాధించడంతోపాటు ధనుష్ కి టాలీవుడ్లో ఓ మార్కెట్ నీ కూడా క్రియేట్ చేశాయి.అందువల్ల ఈ పటాస్ చిత్రాన్ని కూడా తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.