తమిళ హీరో ధనుష్ తెరకెక్కించే ప్రతి సినిమాను తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు.అతడు నటించిన రఘువరన్ బీటెక్ చిత్రం టాలీవుడ్లోనూ సూపర్ హిట్ మూవీగా నిలిచి టాలీవుడ్లో అతడికి మంచి ఫాలోయింగ్ను క్రియేట్ చేసింది.
కాగా మారి చిత్రంతో మాస్ ప్రేక్షకులను మెప్పించడంతో ధనుష్ నటించే చిత్రాలను తెలుగులో మంచి రేటుకు కొనుగోలు చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు.ఇక తాజాగా తమిళ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
కాగా ఈ సినిమాను ‘జగమే తందిరమ్’ అనే టైటిల్తో తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను తెలుగులో ‘జగమే తంత్రం’ అనే టైటిల్తో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.
ఈ సినిమాతో టాలీవుడ్లో అదిరిపోయే క్రియేట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా ఈ సినిమాను తెలుగులో ప్రముఖ బ్యానర్ GA2 మరియు యువీ క్రియేషన్స్ కలిసి రిలీజ్ చేస్తుండటంతో స్టార్ హీరో సినిమాకు ఉండే క్రేజ్ ఈ సినిమాపై ఏర్పడింది.
ఇక ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటిస్తోండగా, చెన్నై బ్యాక్డ్రాప్తో ఈ సినిమా తెరకెక్కింది.కార్తీక్ సుబ్బరాజ్ తనదైన మార్క్తో ఈ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించాడని, ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
మరి జగమే తంత్రం చిత్రం ఎలాంటి రిజల్ట్ను సాధిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.