కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఐశ్వర్య, ధనుష్ విడిపోవడం గురించి చర్చ జరుగుతోంది.విడాకుల విషయంలో ఐశ్వర్యది తప్పని కొంతమంది చెబుతుంటే ధనుష్ ది తప్పని మరి కొందరు చెబుతున్నారు.
చాలా సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్నారనే కామెంట్లు సైతం వినిపిస్తుండటం గమనార్హం.అయితే ధనుష్, ఐశ్వర్య అభిమానులకు ధనుష్ తండ్రి శుభవార్త చెప్పారు.
ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్లే వాళ్లిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.ప్రస్తుతం ధనుష్ కానీ ఐశ్వర్య కానీ చెన్నైలో లేరని ధనుష్ తండ్రి అన్నారు.
ధనుష్ తో ఐశ్వర్యతో ఈ విషయం గురించి తాను ఫోన్ లో మాట్లాడానని ధనుష్ తండ్రి వెల్లడించారు.త్వరలో ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలిసే అవకాశాలు అయితే ఉన్నాయని ధనుష్ తండ్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఈ విధంగా కామెంట్లు చేయడంతో ధనుష్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.రజినీకాంత్ కూడా ధనుష్, ఐశ్వర్య తీసుకున్న నిర్ణయాన్ని మార్చడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని బోగట్టా.
సోషల్ మీడియా వేదికగా ఈ విషయం గురించి ధనుష్ అభిమానులు రజినీకాంత్ అభిమానుల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి.మరోవైపు ధనుష్ సినిమాలతో బిజీ అవుతున్నారు.
వరుసగా పాన్ ఇండియా సినిమాలలో ధనుష్ నటిస్తుండగా ధనుష్ నటించిన ఆత్రంగి రే త్వరలో రిలీజ్ కానుంది.ధనుష్ వరుసగా మాస్ సినిమాలలో నటిస్తున్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటడానికి ధనుష్ ప్రయత్నాలు చేస్తున్నారు.తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం అందుతోంది.