ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ మార్కెట్ విపరీతంగా పెరిగింది.హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎన్నో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి.
కరోనా కారణంగా ఇండియాలో కూడా ఓటీటీ మార్కెట్ పెరిగింది.ప్రస్తుతం ఇండియాలో భారీ ఎత్తున ఓటీటీ బిజినెస్ జరుగుతుంది.
అందుకే స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీ ద్వారా విడుదలకు సిద్దం అవుతున్నాయి.ఇప్పట్లో థియేటర్లు ప్రారంభం అయ్యే అవకాశం లేదనే ఉద్దేశ్యంతో బాలీవుడ్లో పలు సినిమాలు ఓటీటీ ద్వారా వస్తున్నాయి.
సౌత్లో మాత్రం ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాలు ఓటీటీ రిలీజ్కు ముందుకు రాలేదు.తెలుగు మరియు తమిళంలో కొన్ని సినిమాలు విడుదల అయినా కూడా అవి చిన్నా చితక సినిమాలు.మొదటి సారి సౌత్లో ధనుష్ చిత్రం ఓటీటీ విడుదలకు రెడీ అవుతుంది.ఈసారి స్టార్ హీరో సినిమా ఓటీటీలో విడుదల అయ్యేందుకు రెడీ అయిన నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.
మొదటి పెద్ద సినిమాగా ఇది రికార్డుల్లో నిలువబోతుంది.
ధనుష్ నటించిన జగమే తంత్రం అనే తెలుగు, తమిళ చిత్రంను అమెజాన్ ప్రైమ్లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు.ధనుష్ మొదట నో చెప్పినా కూడా నిర్మాత ఆర్థికంగా నష్టపోకూడదు అనే ఉద్దేశ్యంతో విడుదలకు ఓకే చెప్పాడట.త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.