కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య విడిపోతున్నట్టు కొన్నిరోజుల క్రితం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.ఈ ప్రకటన ఐశ్వర్య, ధనుష్ అభిమానులను ఎంతగానో బాధపెట్టింది.
విడాకుల ప్రకటన తర్వాత ఐశ్వర్య, ధనుష్ వేర్వేరుగా సినిమా పనులతో బిజీ అయ్యారు.ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలిసే ఛాన్స్ ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా వాళ్లిద్దరూ మళ్లీ కలవడం కష్టమని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
అయితే ప్రస్తుతం ఐశ్వర్య, ధనుష్ ఒకే హోటల్ లో ఉన్నారు.రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న సితార హోటల్ లో అటు ధనుష్, ఇటు ఐశ్వర్య బస చేస్తున్నారు.
ఒకే హోటల్ లో ఉన్నా వీళ్లిద్దరూ ఎడమొహం పెడమొహంలా ఉన్నారని సమాచారం అందుతోంది.వీళ్లిద్దరి మధ్య మాటలు లేవని తెలుస్తోంది.ధనుష్, ఐశ్వర్యలకు ఒకే హోటల్ లో ఉండటం ఇష్టం కాకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లు ఉండాల్సి వచ్చిందని సమాచారం.
ధనుష్ ప్రస్తుతం సర్ అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
మరోవైపు ఐశ్వర్య ఒక సాంగ్ షూటింగ్ కొరకు హైదరాబాద్ కు వచ్చారు.18 సంవత్సరాల వివాహ బంధానికి వీళ్లిద్దరూ ఇటీవల గుడ్ బై చెప్పారు.ధనుష్, ఐశ్వర్యల విడాకులపై వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మరోవైపు వీళ్లిద్దరూ ఒకే హోటల్ లో ఉండి మాట్లాడుకోకుండా ఉండటం కరెక్ట్ కాదని కొంతమంది చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల అనవసరంగా వీళ్లిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రజనీకాంత్ విడిపోయిన ఈ జంటను కలిపే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ధనుష్ తెలుగులో కూడా మార్కెట్ ను పెంచుకోవాలనే ఆలోచనతో తెలుగు సినిమాలలో నటించడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.