తెలుగులో 2005వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు తేజ మరియు హీరో నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన “ధైర్యం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ “రైమా సేన్” సుపరిచితమే.అయితే మొదటగా రైమా సేన్ బాలీవుడ్లో “గాడ్ మదర్” అనే చిత్రం ద్వారా బాలీవుడ్ సినిమా పరిశ్రమకి నటిగా పరిచయమైంది.
వచ్చీరావడంతోనే తన నటనా ప్రతిభను నిరూపించుకోవటంతో బెంగాలీ, తమిళం, మలయాళం, కన్నడ, తదితర భాషలలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.ఈ క్రమంలోనే “ధైర్యం” చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.
కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈ అమ్మడికి తెలుగులో సరైన గుర్తింపు లభించలేదు.దీంతో ఈ అమ్మడు కొంత కాలం పాటు టాలీవుడ్ సినిమా పరిశ్రమని పక్కన పెట్టింది.
బాలీవుడ్లో మాత్రం వరుసగా సినిమా అవకాశాలు తలుపు తట్టడంతో చివరికి తెలుగు సినిమా పరిశ్రమని మర్చిపోయింది.అందువల్లనే ఈ అమ్మడు “ధైర్యం” చిత్రంలో నటించిన తర్వాత మళ్ళీ తెలుగులో ఎలాంటి చిత్రాలలోనూ నటించలేదు.
అయితే అప్పట్లో ఈ బాలీవుడ్ బ్యూటీకి రవితేజ, ఉదయ్ కిరణ్, శ్రీరామ్, తరుణ్ తదితర స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల నటించ లేదు.కాగా ఆ మధ్య ఒడిస్సా కి చెందినటువంటి ఓ ప్రముఖ పొలిటిషన్ తో ఈ అమ్మడు కొంతకాలం పాటు ప్రేమాయణం నడిపింది.
దీంతో అందరూ తొందరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే అనుకున్నారు.
కానీ ఏమైందో ఏమో గానీ రైమా సేన్ తన ప్రియుడికి బ్రేకప్ చెప్పి మళ్లీ నటన వైపు దృష్టి సారించింది.
కాగా రైమా సేన్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ తదితర భాషలలో కలిపి దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కాగా ఆ మధ్య ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొని “టాప్ లెస్” దుస్తులు ధరించి అందాలతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేసింది.
కాగా ప్రస్తుతం ఈ అమ్మడు మలయాళంలో తెరకెక్కుతున్న “అగ్ని సిరాగూగుల్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.