కలియుగ వైకుంఠ ధామంగా పిలవబడే ఆలయం తిరుమల ఆలయం అన్న విషయం తెలిసిందే.ఒకప్పుడైతే శ్రీవారిని దర్శించుకోవాలంటే ఒక్కో సారి మూడు రోజులు కూడా పట్టేది.
కానీ నేడు కోవిడ్ మూలంగా ఇక్కడి భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
అసలే దేశంలో కరోనా వ్యాప్తి శరవేగంగా ఉండటంతో, అన్ని ఆలయాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.
ఈ క్రమంలో తిరుమలలో కూడా కోవిడ్ నిబంధనలు అమలవుతున్న నేపధ్యంలో, ప్రజల్లో నెలకొన్న భయం వల్లనో తెలియదు గానీ తిరుమలలో భక్తుల సంఖ్య సాధారణ స్థాయితో పోలిస్తే గణనీయంగా తగ్గిందని అధికారులు వెల్లడిస్తున్నారు.
తాజాగా రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న వేళ మళ్లీ భక్తుల సంఖ్య పడిపోయింది.
ఎంతలా అంటే.నిన్న మంగళవారం కేవలం 11,490 మంది భక్తులు మాత్రమే స్వామిని దర్శించుకోవడం విశేషం.
కాగా 5,024 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా,.హుండీ ద్వారా స్వామివారికి రూ.1.30 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.