శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు బారులు తీరారు.ఇవాళ సూర్య గ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు మూతపడ్డాయి.

కానీ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉంది.ఇక్కడ నిత్యం రాహు, కేతువులకు పూజలు నిర్వహిస్తుంటారు.

మిగతా ఆలయాల్లో సంప్రోక్షణ చేసిన తర్వాతే పూజలు, దర్శనాలు కల్పించనున్నారు.కానీ గ్రహణ సమయంలోనూ శ్రీకాళహస్తీశ్వరాలయం తెరిచే ఉంది.

ఏ గ్రహణమైనా సూర్య చంద్రులను కబళించేది రాహు కేతువులే.పురాణాల ప్రకారం రాహు, కేతువులకు గ్రహాధిపత్యం ఇచ్చింది శివుడేనని ప్రతీతి.

Advertisement

ఈ నేేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరుడికి నవగ్రహ కవచం అలంకరించారు ఆలయ అధికారులు.ఇవాళ స్వామివారిని దర్శిస్తే రాహు, కేతు, నక్షత్ర, నవగ్రహా దోషాలు ఉండవు.

ఈ క్రమంలోనే గ్రహణ సమయంలో స్వామివారికి నాలుగు కాలాల అభిషేకాలు నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు