అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా పై చాలా నమ్మకంతో ఉన్నారు.
మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిస్తున్న విషయం తెల్సిందే.అల్లు అర్జున్ పారితోషికం వంద కోట్లు కాగా సుకుమార్ పారితోషికంగా దాదాపుగా యాబై కోట్లు అంటూ ప్రచారం జరుగుతోంది.
ఇక రష్మిక మందన్నా కి కూడా ఏకంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట.కనుక ఈ సినిమా యొక్క బడ్జెట్ భారీగా పెరుగుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
పుష్ప సినిమా యొక్క పాటలు ఎంతటి విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రతి ఒక్కరికి తెల్సిందే.అన్ని పాటలు కూడా భారీ గా స్పందన దక్కించుకున్నాయి.అంతే కాకుండా యూట్యూబ్ లో బిలియన్ వ్యూస్ ను పుష్ప ఆల్బం సొంతం చేసుకుంది.
అందుకే పుష్ప 2 యొక్క ఆల్బం పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.దేవి శ్రీ ప్రసాద్ కి విపరీతమైన డిమాండ్ ఉంది.పైగా ఇటీవల ఆయన సంగీతం అందించిన వాల్తేరు వీరయ్య కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ఆల్బం కూడా సూపర్ హిట్ అయ్యింది.అందుకే పుష్ప 2 కోసం దేవి శ్రీ ప్రసాద్ అటు ఇటుగా దాదాపు అయిదు కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్నాడు
అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.దేవి శ్రీ ప్రసాద్ యొక్క ప్రతిభకు ఆయన మ్యూజిక్ కి అయిదు కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడం తప్పేం కాదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.పుష్ప 2 మ్యూజిక్ హిట్ అయితే కచ్చితంగా ముందు ముందు దేవి శ్రీ ప్రసాద్ రెమ్యూనరేషన్ మరింత పెరిగే అవకాశం ఉంది.