టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్, ఇస్మార్ట్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటికే సినిమాకి సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి.వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ మొదటి సారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కొద్దిగా తన స్టైల్ మార్చుకున్న రామ్ ఈ సినిమాలో కూడా పక్కా మాసివ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడని టాక్ వినిపిస్తుంది.
లింగుస్వామి అంటే తమిళ్ లో యాక్షన్ సినిమాలు గుర్తుకొస్తాయి.ఈ నేపధ్యంలో శంకర్ ని కూడా అలాగే రిప్రజెంట్ చేస్తాడనే మాట వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి క్యాస్టింగ్ సెలక్షన్ పూర్తయినట్లు బోగట్టా.
ఇక ఈ సినిమాకి మ్యూజిక్ కింగ్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.
గతం రామ్ హీరోగా నటించిన జగడం, రెడీ, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, శివమ్, హలో గురూ ప్రేమకోసమే వంటి చిత్రాలకు మ్యూజిక్ అందించాడు.ఇదిలా ఉంటే రీసెంట్ గా ఉప్పెన సినిమాతో దేవిశ్రీ మ్యూజికల్ హిట్ కొట్టాడు.
అయితే ఈ మధ్య దేవిశ్రీ స్టార్ హీరోల సినిమాలకి మాత్రమే బెస్ట్ మ్యూజిక్ ఇస్తున్నాడని, చిన్న సినిమాలకి అంత పెర్ఫెక్ట్ గా సంగీతం అందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.అతని ట్రాక్ రికార్డ్ పరంగా కూడా స్టార్ హీరోలు, లేదంటే దర్శకులతో చేసిన సినిమాలు మ్యూజికల్ హిట్ అయ్యాయి.
మినిమమ్ రేంజ్ హీరోలతో చేసిన సినిమాలు మ్యూజిక్ పరంగా జనాలకి రీచ్ కాలేదు.అయితే రామ్, దేవిశ్రీకి మంచి అనుబంధం ఉంది కాబట్టి ఈ సినిమాలో విషయంలో అల జరగకపోవచ్చనే మాట వినిపిస్తుంది.