ఏపీ సీఎం వైఎస్ జగన్ సంపాదన సృష్టించడం చేతకాక అడ్డదారిలో సంపాదనకు ప్రయత్నిస్తున్నాడు అంటూ మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశాడు.
రాష్ట్రానికి సంపాదన లేదని ఈ విపత్తు సమయంలో వైన్స్ ఓపెన్ చేయడం దారుణం అన్నారు.ఇదే సమయంలో వైన్స్ రేట్లను ఏకంగా 75 శాతంకు పెంచడం కూడా దారుణం అంటూ దేవినేని అభిప్రాయ పడ్డారు.
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచడంపై కూడా ఆయన మండి పడ్డాడు.
ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇతరత్ర మార్గాలు చాలానే ఉన్నాయి.
కాని మీరు చేస్తున్న పని ఏంటీ అంటూ ప్రశ్నించారు.మీ అనుభవలేమితో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
మద్యం అమ్మకాలు, విద్యుత్ చార్టీలతో సామాన్యుల నడ్డి విరవడమే అని, ప్రభుత్వంకు ఇంతకు మించిన మార్గాలు మరేమి భించలేదా అన్నాడు.ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవాలంటే ప్రజల్లోకి రావాలి.
జగన్ గారు ఇప్పటికైనా మీరు తాడేపల్లి రాజప్రాసాదంను వీడి ప్రజల్లోకి రావాలి.అప్పుడే ప్రజలు పడుతున్న కష్టాలు మీకు అర్థం అవుతాయి.
మీరు చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యులకు ఎంతగా ఇబ్బందులు కలిగిస్తున్నాయో మీకు అర్థం కావడం లేదంటూ ఆరోపించాడు.