తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమ తాజాగా మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం విధానాలపై విమర్శలు గుప్పించారు.జాతీయ మీడియా జగన్ ప్రభుత్వాన్ని ఎండగడుతోందని ఎద్దేవా చేశారు.
ఉపాధి హామి నిధులు వస్తే ట్రెజరీలో పెట్టుకోవడానికి కారణాలేంటి?, నన్నపనేని రాజకుమారి, అచ్చెన్నాయుడుపై అక్రమ కేసులను నమోదు చేశారు.జగన్ ప్రభుత్వం వచ్చి రాష్ట్ర అభివృద్ధిని దెచ్చతీశారంటూ మండిపడ్డారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పలు టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిలిపి వేశారు.వాస్తవాలను చూపించే సదరు ఛానెళ్లను ఎందుకు ఆపేసారో మంత్రులు తగిన కారణాలను చూపించాలి.ఆ ఛానెళ్లు తిరిగి ప్రసారం అయ్యే వరకు మా ఉద్యమం ఇలాగే ఉంటుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మీడియా స్వేచ్ఛను అరికట్టడం రాజ్యాంగ విరుద్ధం అంటూ గుర్తు చేశారు.
ఇకపోతే గత మూడు నెలలుగా మన రాష్ట్రంలో రివర్స్ పాలన జరుగుతుందని విమర్శలు గుప్పించారు
.