తెలుగు దేశం పార్టీ గతంలో తీసుకు వచ్చిన పలు పథకాలను వైకాపా ప్రభుత్వం కొత్త పేర్లతో తీసుకు వచ్చి తామే ఆ పథకాలను తీసుకు వస్తున్నట్లుగా అబద్దాలు ఆడుతున్నట్లుగా తెలుగు దేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో గతంలో ‘ఐ’ అనే కార్యక్రమాన్ని తెలుగు దేశం ప్రభుత్వం ప్రారంభించి లక్షలాది మందికి కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు, వారికి అవసరం అయిన మందులు కూడా ఇచ్చామని దేవినేని ఉమా అన్నారు.
ఇప్పుడు ఆ పథకంను ఆపేసి మళ్లీ కొత్త పథకం అంటూ కంటి వెలుగును తీసుకు వచ్చారు.ప్రభుత్వంకు మద్దతుగా ఉన్న వారికి కాంట్రాక్ట్ ఇచ్చే ఉద్దేశ్యంతో పథకం పేరు మార్చి మళ్లీ అదే పథకంను తీసుకు వచ్చినట్లుగా ఆయన ఆరోపించాడు.
జగన్ తీసుకు వచ్చేవి అన్ని కూడా గతంలో తెలుగు దేశం పార్టీ ప్రవేశ పెట్టినవే అని, పేర్లు మార్చి పథకాలను కొత్తవిగా ప్రచారం చేసే అవసరం ఏంటీ అంటూ దేవినేని ప్రశ్నించారు.వైకాపా ప్రభుత్వం నేడు ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన విషయం తెల్సిందే.