దేశంలో ఏ రాజకీయ నేతలు ఇంతలా వార్తల్లో ఉండరేమో అనిపిస్తుంది ఏపీ రాజకీయ నేతలను చూస్తుంటే.నిత్యం ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంలో ఏపీ నేతలు మాత్రం మొదటిస్దానంలో ఉంటారని సందేహించవలసిన అవసరం లేదట.
ఇకపోతే ప్రజల యోగ క్షేమాల గురించి ఆలోచించవలసిన ఈ సమయంలో ఏపీ రాజకీయ నేతలు ఒకరి పై ఒకరు ఆరోపణలతోనే కాలాన్ని గడుపుతున్నారనే ప్రచారం జరుగుతుంది.ఇదిలా ఉండగా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కరోనా వైరస్ బాధితుల విషయంలో వైఎస్ ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదంటూ నిరసన దీక్షకు దిగారు.
కాగా ఏపీలో సమస్య ఉంటే ఉమ మాత్రం హైదరాబాద్లోని తన నివాసంలో దీక్షకు దిగడం కొందరిని ఆశ్చర్యానికి లోనుచేస్తుందట.
ఇక కరోనా బాధితులకు చికిత్స, ఆక్సిజన్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, కొవిడ్ పరీక్షలను కూడా సరిగా చేయలేకపోతోందని ఈ సంధర్భంగా ఉమ ధ్వజమెత్తారు చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేశారు.