జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన దేవినేని ఉమా..!! 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రాన్ని జగన్ ఎందుకు నిలదీయ లేకపోతున్నారు అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు దేవినేని ఉమాసీబీఐ మరియు ఈడీ కేసులు ఉండటంవల్ల వాటినుంచి బయటపడటానికి జగన్ కేంద్రాన్ని ప్రశ్నించ లేక పోతున్నారని, కేంద్ర పెద్దల దగ్గర లొంగిపోయారు అందుకే మౌనం వహిస్తున్నారు అంటూ విమర్శల వర్షం కురిపించారు.

 Devineni Uma Made Serious Comments On Jagan Devineni Uma,ys Jagan,vizag Steel Pl-TeluguStop.com

దాదాపు ఇరవై రెండు వేల ఎకరాల్లో 50 సంవత్సరాల క్రితం నిర్మాణమైన విశాఖ ఉక్కు ను ప్రైవేటు పరం చేస్తుంటే ఉక్కు పరిశ్రమ గేటు వద్ద వెళ్లి మాట్లాడే ధైర్యం కూడా వైసిపి మంత్రి అవంతి శ్రీనివాస్, కన్నబాబు విజయసాయిరెడ్డికి లేకుండా పోయింది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు దేవినేని ఉమ.

అదేవిధంగా పోలవరం పనుల విషయంలో కేంద్రాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది అని మండిపడ్డారు.కమీషన్ల కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టి పోలవరం ప్రాజెక్టు భ్రష్టు పట్టించారు అని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అంటూ  వైసీపీ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube