తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.ఆ పార్టీకి గుండెకాయలాంటి కృష్ణ జిల్లా కు చెందిన యువ నాయకుడు దేవినేని అవినాష్ పార్టీకి రాజీనామా చేసారు.
అలాగే తెలుగు యువత అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు.ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి పంపించారు.
అవినాష్తో పాటు సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు కూడా పార్టీకి రాజీనామా చేశారు.ఇక అవినాష్ వైసీపీలోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీలో గత కొంతకాలంగా అవినాష్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదట.దీంతో ఆయన చాలా గుర్రుగా ఉన్నారట.ఈ నేపథ్యంలో బుధవారం గుణదలలోని తన నివాసంలో దేవినేని నెహ్రూ అభిమానులు, అనుచరులతో సమావేశం నిర్వహించారు.తాజా పరిణామాలతో పాటూ పార్టీ మార్పుపై చర్చించారు.
ఈ సందర్భంగా అవినాష్ ను పార్టీ మారాల్సిందిగా అనుచరులు పెద్ద ఎత్తున వత్తిడి తీసుకురావడంతో ఆయన పార్టీ మారినట్టు తెలుస్తోంది.వైసీపీ లో ఆయన చేరిక లాంఛనం అవ్వడంతో ఆయనకు ఏ పదవి జగన్ ఇచ్చే అవకాశం ఉంది అనే విషయంపై ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు.