ఏపీలో తెలుగు దేశం పార్టీకి కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి.ఎంతో మంది టీడీపీ నాయకులు ఇప్పటికే బీజేపీ మరియు వైకాపాలో జాయిన్ అయ్యారు, అయ్యేందుకు సిద్దం అవుతున్నారు.
పలువురు ముఖ్య నాయకులు ఇప్పటికే పార్టీ వీడగా ఇప్పుడు కృష్టా జిల్లాకు చెంది అత్యంత శక్తివంతమైన యువ నేతగా గుర్తింపు దక్కించుకున్న దేవినేని అవినాష్ తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.తన అభిమానులు మరియు కొందరు కార్యకర్తలతో దేవినేని అవినాష్ పార్టీ మారే విషయమై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
తెలుగు దేశం పార్టీ కొనసాగిస్తున్న విధానాలు మరియు కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగానే తెలుగు దేశం పార్టీని వదలాల్సి వస్తుంది అంటూ ఆయన సన్నిహితుల వద్ద చెప్పినట్లుగా తెలుస్తోంది.అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే అన్ని విధాలుగా బాగుంటుందని, సన్నిహితుల సమస్యలకు ఏమైనా పరిష్కారం చూపాలంటే కూడా అధికారం ఉండాలని అందుకే తాను పార్టీ మారాలనే యోచనకు వచ్చినట్లుగా కార్యకర్తలకు చెప్పడంతో వారు అంతా కూడా ఓకే అన్నారని, త్వరలోనే వైకాపాలో జాయిన్ అయ్యేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
జగన్ నుండి ఇప్పటికే పార్టీ పదవి విషయమై హామీ దక్కినట్లుగా తెలుస్తోంది.