ఏపీ లో ఎన్నికలు ముగిసాయి కానీ టీడీపీ,వైసీపీ ల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది.ఏపీ సి ఎం గా వై ఎస్ జగన్ ఎన్నికైన తరువాత టీడీపీ,వైసీపీ పార్టీ ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.
అప్పటి నుంచి కూడా ఒకరినొకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ ఉన్నారు.శనివారం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి మాజీ మంత్రి లోకేష్ పై వేసిన కౌంటర్ కు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ ఘాటుగా ఎదురు కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ హయాంలో చిదంబరం కాళ్లు పట్టుకున్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అంటూ లోకేష్ కు కౌంటర్ వేశారు.దానికి సమాధానంగా అవినాష్ సాయి రెడ్డి కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.16 నెలలు జైల్లో ఉన్న ఏ1, ఏ2లు ఎవరి కాళ్లు పట్టుకుని బయట తిరుగుతున్నారని విమర్శించారు.
రాజ్యసభ ఎంపీగా ప్రధాని కార్యాలయం చుట్టూ 5 ఏళ్ల పాటు ఎందుకు తిరిగారో చెప్పాలన్నారు.జగన్ పుట్టక ముందు నుంచి చంద్రబాబు నాయుడు మీద అవినీతి విమర్శలు చేస్తూనే ఉన్నారు.అయినా సాధించింది ఏంటో మీకే తెలియాలంటూ విజయసాయి రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అవినాష్.
శనివారం లోకేష్ కౌంటర్ కు సమాధానంగా విజయ సాయి రెడ్డి బాబు పై విమర్శలు చేయడమే కాకుండా మాజీ మంత్రి దేవినేని ఉమా పై కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.