పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని ఆయన సినిమాలకు వర్క్ చేయాలని నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు కోరుకుంటూ ఉంటారు.ఆయనతో సినిమా ఆఫర్ వస్తే ఫ్రీ గా చేసేందుకు కూడా చాలా మంది ఉంటారు.
అలాంటిది దేవిశ్రీ మాత్రం పవన్ సినిమా పారితోషికం విషయంలో మేకర్స్తో విభేదాలు పెట్టుకుంటున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్, హరీశ్ శంకర్ ల కాంబినేషన్లో రూపొందబోతున్న మూవీకి గాను ఏకంగా రూ.2 కోట్ల పారితోషికంగాను దేవిశ్రీ డిమాండ్ చేశాడట.అంత మొత్తం ఇవ్వలేం గత సినిమాలకు తీసుకున్నట్లుగా 1.75 కోట్లు తీసుకోవాల్సిందిగా నిర్మాతలు రిక్వెస్ట్ చేసినా కూడా పట్టించుకోలేదట.ఈ వ్యవహారం ఆనోట ఈనోట పడి ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
పవన్ తో మూవీ అంటూ సంగీత దర్శకులు ఎంతో మంది రెడీగా ఉంటారు.కాని గతంలో పవన్ మరియు హరీష్ శంకర్ల కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ సినిమాలో సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ వ్యవహరించాడు.కనుక ఆ సినిమాకు సంబంధించిన ట్యూన్స్ మంచి హిట్ అయ్యాయి.సినిమా హిట్ లో సంగీతం కీలక పాత్ర పోషించింది.అందుకే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ను తీసుకోవాలని హరీష్ కోరుకోవడం.
ఆయన పారితోషికం తగ్గేది లేదు అంటూ చెప్పడంతో తప్పక నిర్మాతలు ఆయనకు ఓకే చెప్పాల్సి వచ్చింది.ఇక ఈ ఏడాది అల వైకుంఠపురంలో వంటి బిగ్గెస్ట్ సక్సెస్ ను దక్కించుకున్న థమన్ మాత్రం 1.5 కోట్లు మాత్రమే తీసుకుంటాడు.ఆయనతో పోల్చితే దేవిశ్రీ ఎందుకు ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
దేవిశ్రీ ఈమద్య కాలంలో కాస్త క్రేజ్ తగ్గాడు.ఆ విషయం గుర్తించకుండా పారితోషికం పెంచాడు అనే విమర్శలు వస్తున్నాయి.