టాలీవుడ్లో టాప్ సంగీత దర్శకుడు ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో ముందు వరుసలో ఉండే పేరు దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అద్బుతమైన సంగీతాన్ని అందిస్తూ మాస్ ఆడియన్స్ పల్స్ను బాగా పట్టుకోగలిగే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.
అలాంటి దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటి వరకు పలువురు స్టార్ హీరోలతో హీరోయిన్స్తో కూడా పాటలు పాడించాడు.త్వరలో ఈ సంగీత దర్శకుడు పూజా హెగ్డేతో కూడా పాటలు పాడించేందుకు సిద్దం అవుతున్నాడు.
తాజాగా ఈయన్ను స్వయంగా పూజా హెగ్డే కోరింది
మహర్షి చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో పూజా హెగ్డే మాట్లాడుతూ తాను గిటార్ బాగా వాయించడంతో పాటు, పాటలు కూడా బాగానే పాడతాను.కాని నా ప్రతిభను మాత్రం దేవిశ్రీ ప్రసాద్ గుర్తించలేదు.
నాతో చాలా సినిమాలు చేసిన ఆయన నా ప్రతిభను గుర్తించక పోవడం విచారకరం అంటూ చెప్పుకొచ్చింది.దేవిశ్రీ ప్రసాద్ ఇకపై అయినా నాకు అవకాశం ఇస్తాడేమో చూడాలి అంటే తన కోరికను వెళ్లడించింది.ఈ విషయమై దేవిశ్రీ ప్రసాద్ వెంటనే స్పందించాడు
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.నేను ఇప్పటి వరకు పూజాతో చాలా సినిమాలు చేశాను, కాని ఆమె గురించి నాకు తెలియదు, ఆమెలో ఉన్న ప్రతిభ గురించి నాకు తెలియక పోవడంతో ఆమెను వాడుకోలేక పోయాను.ఇకపై ఆమెతో ఖచ్చితంగా తన సినిమాలో పాట పాడించేందుకు ప్రయత్నిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.తన భవిష్యత్తు సినిమాలో ఖచ్చితంగా పూజా పాట ఉంటుందని పేర్కొన్నాడు.పూజా హెగ్డే హీరోయిన్గా ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తోంది.ఇలాంటి సమయంలో ఆమెకు సింగర్ అవ్వాలనే కోరిక కూడా ఉండటం సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకులకు ఆశ్చర్యంను కలిగిస్తోంది.